అదుపు తప్పిన బొలోరో వాహనం.  

ఇద్దరు దుర్మరణం.

Apr 5, 2024 - 15:49
 0  96

జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ నియోజకవర్గం, ఐజ మండల పరిధిలోని ఉత్తనూరు గ్రామ సమీపంలో.. రాయచూరు జిల్లా, ఇడుపునూరు మండలం, మీర్జాపూర్ గ్రామానికి చెందిన బొలెరో వాహనం స్టీరింగ్ విరిగిపోవడంతో వాహనం అదుపు తప్పి ఇద్దరు దుర్మరణం చెందగా పలువురికి గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళ్లగా.. కర్నూలు జిల్లా, బేతంచర్ల శ్రీరంగాపురం మద్దటి స్వామి దర్శనానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉప్పరి నాగప్ప , 8 ఏళ్ల చిన్నారి మనోజ్ లు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించగా, స్వల్ప గాయాలు అయిన వారిని ఐజ పట్టణంలో సన్ రైజ్ హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం తరలించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333