శాంతినగర్ లోని పలు ప్రైవేట్ హాస్పిటల్స్ ని ఆకస్మికంగా తనిఖీ
డైరెక్టర్ మురళి శ్రీనివాస్ కి షో కాజ్ నోటీసు..
జోగులాంబ గద్వాల2 జనవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : వడ్డేపల్లి శాంతినగర్ లోని పలు ప్రైవేట్ హాస్పిటల్స్ ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాయి హిమాన్ ఆసుపత్రిలో క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ -2010 యాక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా, మాధవ్ కృష్ణ అనే వ్యక్తి ఈ హాస్పిటల్ ని నడుపుతున్నందువలన, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ వైద్యాధికారి డాక్టర్ జె. సంధ్యా కిరణ్ మై, మరియు ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్. ప్రసూనా రాణి ఈ హాస్పిటల్ ని సీజ్ చేయడం జరిగింది... తదనంతరము మౌనిక హాస్పిటల్ లో ఈసీజీ మరియు ఎక్స -రే, మిషన్లు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా వాడుతున్నందువల్ల, బయో మెడికల్ వేస్టేజ్ నిర్వహణ సక్రమంగా లేనందువల్ల డైరెక్టర్ మురళి శ్రీనివాస్ కి షో కాజ్ నోటీసు ఇవ్వడం జరిగింది.. బాలాజీ హాస్పిటల్లో ఈసీజీ, ఎక్స -రే మిషన్లు రిజిస్ట్రేషన్ లేకుండా వాడుతున్నందువల్ల, బయో మెడికల్ వేస్టేజ్ నిర్వహణ సక్రమంగా లేనందువల్ల, హాస్పిటల్ రికార్డ్స్ నిర్వహణ సక్రమంగా లేనందువలన హాస్పిటల్ డైరెక్టర్ కి షో కాజ్ నోటీసు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ. డెమో.. కే మధుసూదన్ రెడ్డి,నరసయ్య, డ్రగ్ ఇన్స్పెక్టర్, వినయ్, ఎస్ ఐ నాగ శేఖర్ రెడ్డి, ఆర్ఐ సర్దార్ మియా పాల్గొన్నారు