ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ప్రజా దర్బార్

జగ్గయ్యపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు *కట్టా వెంకట నరసింహారావు

Oct 2, 2024 - 15:12
Oct 2, 2024 - 21:48
 0  95
ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ప్రజా దర్బార్

ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ప్రజా దర్బార్........  

జగ్గయ్యపేట నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కొరకు గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ..

ది.04 -10 - 2024. శుక్రవారం ఉదయం 10 గంటలకు, జగ్గయ్యపేట మండలం, చిల్లకల్లు మండల ప్రజా పరిషత్ కార్యాలయము నందు, స్థానిక శాసనసభ్యులు...

 శ్రీ శ్రీ రామ్ రాజగోపాల్ తాతయ్య గారి ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ నిర్వహించబడుతుంది. గతంలో ప్రకటించిన 3వ తేదీన గ్రామ పంచాయితీలలో గ్రామసభలు ఉన్నందున 4వ తేదీకి ప్రజా దర్బార్ మార్చడం జరిగింది. మార్పును గమనించగలరు కావున జగ్గయ్యపేట రూరల్ మండల పరిధిలోని పౌరులందరూ

 ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనవలసినదిగా తెలియజే స్తున్నాను. జగ్గయ్యపేట మండల పరిధిలోని గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొని 

 మీ గ్రామాలలో ఉన్న ప్రజా సమస్యలను పరిష్కార వేదికకు తీసుకొని రాగలరని మనవి. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల మండల అధికారులందరూ పాల్గొనుచున్నారని తెలియజేస్తున్నాను.

ఇట్లు,

 జగ్గయ్యపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు .

కట్టా వెంకట నరసింహారావు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State