తొండ గ్రామంలోని పోలీసుల కవాతు
తిరుమలగిరి 07 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలం తొండ గ్రామంలోని పోలీస్ మార్చ్ కవాతు ప్రదర్శించారు ఈ సందర్భంగా సిఐ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం జరగబోవు గ్రామపంచాయతీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని, ఎలక్షన్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని ఉద్దేశంతో, తిరుమలగిరి మండల పరిధిలో తొండ గ్రామంలో మూడు మండలాల పోలీసు సిబ్బందితో కలిపి సుమారు 60 మందితో తొండ గ్రామంలో కవాతు నిర్వహించి, ఎన్నికలు ప్రశాంతంగా జరిపించుకోవాలని ప్రజలకు సూచించడం జరిగింది.... ఈ కార్యక్రమంలస ఎస్ఐలు వెంకటరెడ్డి ,చిరంజీవి, సైదులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు..