జర్నలిస్టులకు గుడ్ న్యూస్

Apr 30, 2026 - 18:25
 0  2
జర్నలిస్టులకు గుడ్ న్యూస్

 రేపటి నుంచి కొత్త అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ   కలెక్టర్లకు కీలక ఆదేశాలు.. 

తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. మే 1 నుంచి 10లోపు అర్హులైన జర్నలిస్టులందరికీ కొత్త అక్రిడిటేషన్ కార్డులను అందజేయాలని సమాచార పౌర సంబంధాల శాఖ  స్పష్టం చేసింది.

2022-2024 సంవత్సరాలకు గాను గతంలో జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డుల గడువు ఈ నెల 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో జర్నలిస్టులకు ఇబ్బంది కలగకుండా కొత్త కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 కలెక్టర్లకు కీలక ఆదేశాలు.. 

సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి ఏప్రిల్ 28న నిర్వహించిన సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు, స్పెషల్ కమిషనర్ జి.ముకుంద రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి జిల్లాలో జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటి సమావేశాలను ఏప్రిల్ 30లోపు పూర్తి చేయాలని తెలిపారు. ఆయా అక్రిడిటేషన్ కమిటీల ఆమోదం పొందిన అర్హులైన జర్నలిస్టులకు మే 1 నుంచి మే 10లోపు అక్రిడిటేషన్ కార్డులను జారీ చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, ప్రభుత్వానికి నివేదికను పంపాలని కలెక్టర్లకు సమాచారం అందించారు. ఈ మేరకు జిల్లా పౌర సంబంధాల అధికారులు (DPROs) తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది జర్నలిస్టులకు లబ్ధి చేకూరనుంది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333