ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి లక్ష రూపాయల విలువైన ముర్రా గేదె మృతి
మల్లాపురం తాండ, కేటీ దొడ్డి మండలానికి చెందిన రైతు మూడవత్ పంపా నాయక్, S/O మూడవత్ గోవింద నాయక్ కు చెందిన సుమారు లక్ష రూపాయల విలువైన ముర్రా గేదె ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షంలో ఉరుము పడడంతో మృతి చెందింది.
రైతు పంపా నాయక్ మాట్లాడుతూ తన వ్యవసాయ భూమి గట్టు ఎత్తిపోతల పథకంలో పూర్తిగా కోల్పోయినట్లు, ప్రస్తుతం జీవనాధారం కోసం మూడు ముర్రా గేదెలను పోషిస్తూ పాల వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్నట్లు తెలిపారు.
చనిపోయిన గేదె వయస్సు సుమారు 5 సంవత్సరాలు 6 నెలలు కాగా, రోజుకు ఉదయం 5 లీటర్లు, సాయంత్రం 5 లీటర్లు పాలు ఇస్తుందని తెలిపారు. దీని విలువ సుమారు రూ.1,00,000/- ఉంటుందని పేర్కొన్నారు.
ఈ ఘటనతో రైతు కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. గ్రామ సర్పంచ్ పాండు నాయక్ సంఘటనపై ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
ప్రభుత్వ అధికారులు స్పందించి బాధిత రైతుకు తగిన ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.