సోమవారం ప్రజావాణి యధా విధంగా నిర్వహణ కలెక్టర్

Oct 12, 2025 - 20:34
Oct 12, 2025 - 20:35
 0  15
సోమవారం ప్రజావాణి యధా విధంగా నిర్వహణ కలెక్టర్

జోగులాంబ గద్వాల 12 అక్టోబర్ 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- 

సోమవారం ప్రజావాణి యధా విధంగా నిర్వహణ కలెక్టర్

సోమవారం ప్రజావాణి యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్ అన్నారు.. 

ఈనెల 13వ తేదీ (సోమవారం) యధావిధిగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. గత వారం గ్రామపంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఎన్నికలు రద్దు అయినందున ప్రజావాణి కార్యక్రమాన్ని యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఈ సోమవారం తమ సమస్యలను లిఖితపూర్వకంగా ప్రజావాణి కార్యక్రమంలో సమర్పించుకోవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State