జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు అకాల వర్షాలతో రైతుల్లో గుబులు

పత్తి పంటకు భారీ నష్టం
గద్వాల:బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం గురువారం అల్పపీడనంగా మారి, శుక్రవారం వాయుగుండంగా బలపడటంతో జోగుళాంబ గద్వాల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకాల వర్షాలతో రైతులు గుండెల్లో దడ మొదలైంది. రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు పత్తి పంటకు నష్టం వాటిలే అవకాశముందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాల కలెక్టర్ అధికారులు అప్రమత్తంగా ఉండి సహాయ చర్యలు చేపట్టాలన్నారు.