ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
జోగులాంబ గద్వాల 2జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : _ఎర్రవల్లి. మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ (సీబీఎస్ఈ) పాఠశాల నందు నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ను ఆవిష్కరించిన_
-పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి మధులిక గోవర్ధన్ రెడ్డి._
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి మధులిక గోవర్ధన్ రెడ్డి తెలంగాణ ప్రజలు ఎన్నో పోరాటాల తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని స్వరాష్ట్ర సాధనకోసం 1969 నుండి పోరాటాన్ని ప్రారంభిస్తే 2014లో ఆ కల నెరవేరిందని అంటే నాలుగు దశాబ్దాలకుపైగా పోరాట పలితమే ఇప్పుడున్న మన తెలంగాణ రాష్ట్రం అని అన్నారు.
తెలంగాణ సాధనకోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయని.. ఈ పోరాటంలో ఎందరో ప్రాణత్యాగాలు చేసారని ఎన్నో రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయని ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటువెనక చాలా స్టోరీ దాగివుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ శ్రీ వీర గోవర్ధన్ రెడ్డి, డైరెక్టర్ శ్రీ వీర శ్రీనివాస్ రెడ్డి, కరస్పాండెంట్ శ్రీమతి మధులిక రెడ్డి, నవీన్, చిన్న లాలు, నరేంద్ర, నాగరాజు, మాధవి, సుమయ మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు.