గన్ని బ్యాగుల కొరత లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలి
అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు .
జోగులాంబ గద్వాల 3 మే 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- రాజోలి. మండలంలోని రాజోలి, పచర్ల,వడ్డేపల్లి మండలంలోని కొంకల గ్రామంలో రైతుల జోన్నల కొనుగోలు కేంద్రాల వద్ద గన్ని బ్యాగుల కొరత లేకుండా చూడాలని అలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు అన్నారు. ప్రస్తుతం మార్కిఫెడ్ ఆధ్వర్యంలో జోన్నల కొనుగోలు చేస్తున్నందున తగినన్ని బ్యాగులు అందుబాటులో ఉంచుకోవడం వల్ల రైతులకు ఇబ్బందులు కలగవని ఆయన అన్నారు. రాజోలి లో బ్యాగుల కొరత ఉండటం వల్ల కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది అని, దీని వల్ల ఎర్రటి ఎండలో రైతులు అమ్మకాల కోసం పడి కాపులు కాసే పరిస్థితి నెలకొనే అవకాశాలు ఉంటాయని అలాంటి పరిస్థితి రాకుండా అధికారులు ముందస్తుగా రైతుల ధాన్యానికి సరిపడా బ్యాగులు అందుబాటులో ఉంచాలని దళారుల వ్యవస్థ లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు.