రోడ్డు వేశారు మట్టి వేయడం మరిచారు
జోగులాంబ గద్వాల 10 మార్చి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : మల్దకల్. మండలం బిజ్వారం గ్రామం నుండి సంఘాల రోడ్డు వరకు బీటీ రోడ్లు వేశారు కానీ సైడ్ కు మట్టి వేయడం మరిచారు. దీంతో పలువురు ప్రయాణికులు రోడ్లు సైడ్ కు వెళ్లి క్రిందపడి గాయాల పాలవుతున్నారు. రోడ్డు ప్రక్కన ఆర్ ద ఫీటు వరకు తగ్గు ఉండడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. సైడ్కు మట్టి వేస్తే ఇబ్బందులు ఉండవని ఆర్ అండ్ బి అధికారులకు సూచిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత కాంట్రాక్టు ఓడిపోకలు మట్టి వేసి ప్రయాణం ఇబ్బంది లేకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.