సూర్యాపేట పట్టణానికి హైదరాబాద్ మోరిల నీళ్లు తాగునీరుగా ఇచ్చిన పాపం కాంగ్రెస్ పార్టీదే
ముఖ్యమంత్రి కేసిఆర్
ప్రతినిధి సూర్యాపేట
సూర్యాపేట పట్టణానికి హైదరాబాద్ మోరిల నీళ్లు తాగునీరుగా ఇచ్చిన పాపం కాంగ్రెస్ పార్టీదేఅని సిఎం కేసిఆర్ ద్వజమెత్తారు.సూర్యాపేట నియోజకవర్గం లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, మంత్రి జగదీశ్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు.
దశాబ్దాల తరబడి మూసీ మురికి నీళ్లు తలించిన పాపం కాంగ్రెస్ దే అన్నారు.నల్లగొండ జిల్లాకు చెందిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు చాలా అహంకారంతో మాట్లాడుతున్నారు అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. పండవెట్టి తొక్కుతాం అన్నోళ్లేనా నల్లగొండ శాసకులు..? ఎంతకాలం వీళ్ల రాజ్యం సాగుతది..? అని కేసీఆర్ నిలదీశారు.
ఇదే జిల్లాలో మునుగోడు, దేవరకొండ ప్రాంతాల్లో ఫ్లోరైడ్ నీళ్లు తాగించి, లక్షా 50 వేల మంది బతుకులను కరాబ్ చేశారు ఈ కాంగ్రెస్ నాయకులు అని విరుచుకు పడ్డారు.నా కంటే దొడ్డుగా, ఎత్తుగా ఉన్నోళ్లు చాలా మంది ఉన్నారు మరి ఎందకు చేయలేదు వారు, ఎందుకు ఆలోచించలేదు,కనీసం మంచినీళ్లు ఎందుకు ఇవ్వలేదనీ ప్రశ్నించారు. ఇవాళ బ్రహ్మాండంగా పాలేరు నుంచి పాలలాంటి నీళ్లు వస్తున్నాయని ,నాగార్జున సాగర్ కింద టేయిల్ పాండ్ నుంచి మంచినీళ్లు వస్తున్నాయని ,ఈ మంచినీళ్లు కూడా ఇయ్య చేతకాని కాంగ్రెస్ నాయకులు అడ్డం పొడవు చాలా అహంకారంతో మాట్లాడుతున్నారు అని కేసీఆర్ మండిపడ్డారు.
నిన్న రాజగోపాల్ రెడ్డి మాట్లాడారని ,నేను నకిరేకల్ పోతే అక్కడ చెప్తున్నారని,మేం గెలిచిన తెల్లారి బిడ్డా మిమ్మల్ని రోడ్డు మీద పండవెట్టి తొక్కుతాం అని మాట్లాడుతున్నారని,ఈ అహంకార నాయకులు, ఈ డబ్బు మదం ఉన్నోళ్లు వీళ్లేనా.. నల్లగొండ శాసకులు..? అని అన్నారు. ఇది ఎర్ర జెండాలు ఎగిరిన గడ్డ అని,కమ్యూనిస్టు ఉద్యమాలు నడిచిన గడ్డ అని, భీంరెడ్డి నర్సింహారెడ్డి లాంటి మహానీయులు పని చేసిన గడ్డ ఆని,ఈ గడ్డ మీద ఈ దుర్మార్గుల ఆగడాలు ఏందని, వీళ్లు ఎంతవరకు చేస్తరని ,ఎంతకాలం వీళ్ల రాజ్యం సాగుతదని ,మీరు ఆలోచన చేయాలని ,ఇది మీకు చాలా డేంజర్, పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటది అని కేసీఆర్ పేర్కొన్నారు.
సూర్యాపేట ప్రజా ఆశీర్వాద సభ కు పోటెత్తిన జనం
58 ఏళ్లు మనల్ని ఏడిపించిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు.
రాయి ఏదో,రత్నం మేదో మనం గుర్తించాలని,తల రాత ను మార్చే ఓటు ను జాగ్రత్తగా వినియోగించాలి అని కెసిఆర్ అన్నారు.
మేధో మధనం చేసి తెలంగాణను బాగు చేసుకున్నాం అన్నారు.
తెలంగాణ లో నీటి పన్నులు లేవు అన్నారు. తుంగతుర్తి, సూర్యాపేటలో నీళ్లు లేక నాలుగు దశాబ్దాలుగా గోసపడిన ప్రజలకు కాలేశ్వరం వరంగా మారిందన్నారు.
ఏడాదిలో పది నెలలు కాలువలు నిండుగా పారుతున్నాయన్నారు.
ధాన్యం అందించడంలో పంజాబ్ ని అదిగమించాం అని అన్నారు. ధరణి తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యం వస్తుందన్నారు. జగదీష్ రెడ్డి చేసిన అభివృద్ధి నల్లగొండ జిల్లాలో గతం లో ఏ మంత్రి అయినా చేసిండా? అంటూ ప్రశ్నించారు. 30 వేల కోట్లతో థర్మల్ పవర్ ప్రాజెక్టును తీసుకొచ్చింది జగదీష్ రెడ్డి నే అన్నారు.
జగదీష్ రెడ్డికి ఓటు వేస్తే మెజార్టీ పెరుగుతదన్న కేసిఆర్ బిజెపికి ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్టే అన్నారు.
సూర్యాపేట మరింత అభివృద్ధి జరగాలంటే జగదీష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి అన్నారు. జగదీష్ రెడ్డిని గెలిపిస్తే మరోసారి మంచి స్థానం లో ఉంచుతా అన్న కేసీఅర్ ఇన్ డైరెక్ట్ గా మరోసారి
మంత్రిని చేస్తా అంటూ సంకేతం ఇచ్చారు. సూర్యాపేట అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ ను గంగలో కలపండి అంటూ పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ కు ఓటేస్తే అగమవుతామని అన్నారు. గిరిజన బిడ్డలను బిఆర్ఎస్ పార్టీ కళ్ళ లో పెట్టి చూసుకుంటుందన్నారు. రాబోయే ప్రభుత్వం లో వారికి గిరిజన బంధు తీసుకువస్తాం అన్నారు. ఆటో కార్మికులకు ఫిట్ నెస్ చార్జీలు రద్దు చేస్తాం అన్నారు. మళ్లీ జగదీష్ రెడ్డి ని గెలిపిస్తే సూర్యాపేటకు పారిశ్రామిక పార్క్, ఐటీ పరిశ్రమ విస్తరణ, నల్లచెరువు నెక్లెస్ రోడ్, టూరిస్ట్ జంక్షన్ గా సూర్యాపేట ను తీర్చి దిద్దుతామన్నారు.
సూర్యాపేటకు, తుంగతుర్తికి నాలుగు దశాబ్దాల పాటు సాగునీళ్లు రాలేదు
కాంగ్రెస్పై సీఎం కేసీఆర్ ఫైర్
సూర్యాపేట, తుంగతుర్తికి నాలుగు దశాబ్దాల పాటు సాగునీళ్లు రాకుండా పెండింగ్ పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు.
జగదీశ్ రెడ్డి నా సహచర ఉద్యమకారుడే అని, ఆనాడు ఏ విధంగా పోరాటం చేశామో మీకు తెలుసనీ ,ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అనీ,58 ఏండ్లు ఏడిపించింది మనల్ని కాంగ…
[7:02 pm, 21/11/2023] Bantu Krushna Journalist: సూర్యాపేట నియోజకవర్గ జర్నలిస్టు మిత్రులకు నమస్కారం
ఈరోజు రాత్రి 8 గంటలకు సదాశివరెడ్డి ఫంక్షన్ హాల్ లో జర్నలిస్టు మిత్రుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా ప్రియతమ మంత్రివర్యులు శ్రీ గుంటకండ్ల జగదీశ్ రెడ్డి గారు హాజరవుతారు. కావున ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు సకాలంలో చేరుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి.