కాకినాడ లో డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు విషయంలో ఎమ్మెల్సీ అనంతబాబు ను అరెస్ట్
తానేటి వనిత - హోం శాఖ మాత్యులు...
తానేటి వనిత - హోం శాఖ మాత్యులు...
కాకినాడ లో డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు విషయంలో ఎమ్మెల్సీ అనంతబాబు ను అరెస్ట్ చేయడం జరిగింది.
ఈ కేసు విషయంలో ప్రభుత్వం, సీఎం జగన్ మోహన్ రెడ్డి నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకున్నారు.
ప్రతిపక్ష టీడీపీ నాయకులు ఈ విషయాన్ని రాజకీయలబ్ది కోసం వాడుకోవాలని చూస్తున్నారు.
టీడీపీ అధికారంలో వున్నప్పుడు జరిగిన బాలకృష్ణ కాల్పుల విషయం, బోండా ఉమా కుమారుడు చేసిన ఆక్సిడెంట్, కర్నూల్ లో వైస్సార్సీపీ నాయకుడు నారాయణరెడ్డి హత్య విషయంలో కేఈ హస్తం ఎంత ఉందో ప్రజలందరికీ తెలుసు.
ఆ రోజు టీడీపీ ప్రభుత్వం హంతకుల పక్షాన నిలబడింది.
ఈ రోజు మన సీఎం జగన్ పేదలు, బడుగుబలహీన వర్గాలు, దళితులు, న్యాయం పక్షాన నిలబడ్డారు.
న్యాయం కోసం తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్సీ అనంతబాబు ను అరెస్ట్ చేయడం జరిగింది.
నిష్పక్షపాతంగా ప్రభుత్వం, సీఎం జగన్ పనిచేస్తున్నారు అనడానికి ఇదే నిదర్శనం.
సీఎం జగన్ గారి పాలనలో కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా పాలన అందిస్తున్నాము.
అదేవిధంగా న్యాయం, చట్టం విషయంలో కూడా ముఖ్యమంత్రి తన మన బేధం లేకుండా తప్పుచేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు.
ఎమ్మెల్సీ అనంతబాబు పై చర్యలు తీసుకోవడంతో పాటు, పేదలు, దళితుల పక్షాన సీఎం జగన్ నిలబడ్డారు.
ప్రతిపక్ష టీడీపీ పార్టీకి మాట్లాడడానికి కూడా అర్హత లేదు.
టీడీపీ ప్రభుత్వంలో ఎలాంటి అన్యాయాలు జరిగాయి. ఇప్పుడు ఎలాంటి న్యాయం జరుగుతోందని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది.